IND vs ENG 4th Test | టీమిండియా సారథి రోహిత్ శర్మ టెస్టులలో మరో రెండు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన హిట్మ్యాన్.. 27 బంతుల్లోనే 24 పరుగులు పూర్తిచేసి నాటౌట్గా నిలిచాడు. తద్వారా టెస్టులలో అతడు 4 వేల పరుగుల మైలురాయిని చేరాడు. అంతేగాక అంతడు ఇంగ్లండ్పై వెయ్యి పరుగులను పూర్తిచేసుకున్నాడు.
టెస్టులలో నాలుగు వేల పరుగులు పూర్తిచేసుకున్న రోహిత్.. వన్డేలలో 10 వేల పరుగుల (10,709) మైలురాయిని దాటగా టీ20లలో విరాట్ కోహ్లీ తర్వాత రెండో అత్యధిక పరుగులు (3,974) చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కాగా భారత్లో టెస్టులలో నాలుగు వేల పరుగులు పూర్తిచేసిన 17వ బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో సచిన్ (15,921), ద్రావిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో (8,848) ఉన్నాడు. అయిఇతే యాక్టివ్ ప్లేయర్లలో మాత్రం కోహ్లీ, పుజారా (7,195), రహానే (5,077) తర్వాత రోహిత్ ఉన్నాడు.
Another milestone with the bat for the #TeamIndia Captain 🙌
Rohit Sharma completes 4000 runs in Tests 👏👏
Follow the match ▶️ https://t.co/FUbQ3MhXfH #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/4Pi5HPnRMR
— BCCI (@BCCI) February 25, 2024
ఇంగ్లండ్పై టెస్టులలో వెయ్యి పరుగులు పూర్తిచేసిన 15వ భారత భ్యాటర్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో సచిన్, గవాస్కర్, కోహ్లీ, అజారుద్దీన్, ద్రావిడ్, గుండప్పా విశ్వనాథ్, పుజారా, వెంగ్సర్కార్, కపిల్దేవ్, మంజ్రేకర్, ధ్నో, అశ్విన్, జడేజాలు ఉన్నారు.
Rohit Sharma completed 1000 runs in Tests against England.
– The Hitman 🔥⭐ pic.twitter.com/9hIYE1q2ml
— Johns. (@CricCrazyJohns) February 25, 2024