ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే కేవలం 89 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. దీంతో టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్గా రికార్డుల్లో నిలిచాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉండేది. 2006లో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో ధోనీ కేవలం 93 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. ఈ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు. కాగా, టీమిండియా కేవలం 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో క్రీజులోకి వచ్చిన పంత్ అద్భుతంగా రాణించాడు. అతనితోపాటు జడేజా కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.