ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ్లండ్ టెస్టు రెండో రోజున జడేజా అవుటైన తర్వాత బుమ్రా రెచ్చిపోయి ఆడాడు.
స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. బుమ్రా కొట్టిన సిక్సర్లలో ఒకటి నోబాల్ కూడా. దానికితోడు ఆ ఓవర్లో బ్రాడ్ వేసిన ఒక వైడ్ బాల్ బౌండరీకి వెళ్లింది. దీంతో ఏకంగా ఆ ఓవర్లో 35 పరుగులు వచ్చాయి. వీటిలో బుమ్రా సాధించిన పరుగులు 29. ఇలా టెస్టు మ్యాచ్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.
ఇంతకుముందు ఈ రికార్డు క్రికెట్ లెజెండ్ బ్రయాన్ లారా పేరిట ఉండేది. రాబిన్ పీటర్సన్ బౌలింగ్లో లారా ఒకే ఓవర్లో 28 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన ఓవర్ వేసిన ఆటగాడిగా బ్రాడ్ కూడా ఒక చెత్త రికార్డును తన పేరిటి లిఖించుకున్నాడు.
టీ20 క్రికెట్లో కూడా ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు బ్రాడ్ పేరిట ఉంది. 2007లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్.. బ్రాడ్ వేసిన ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి 36 పరుగులు సాధించాడు. ఇప్పుడు మళ్లీ ఇండియాతో మ్యాచ్లోనే బ్రాడ్ మరో చెత్త రికార్డు సాధించగం గమనార్హం.
The Most Expensive Over In Test Cricket History, Captain Jasprit Bumrah Supremacy Guys🇮🇳#INDvsENG | #TeamIndiapic.twitter.com/vQRzjTDAEi
— Anjali ♡ (@imAnjalii718) July 2, 2022