ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బాస్టన్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ సమయంలో బుమ్రాతో మాట్లాడిన ప్రెజెంటర్, ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్క్ బచర్.. తొలిసారి కెప్టెన్సీ చేస్తున్నందుకు అభినందించాడు. ‘‘మామూలుగానే పేసర్లను కెప్టెన్లుగా చూడటం అరుదు. అది కూడా భారత జట్టు సారధిగా ఒక ఫాస్ట్ బౌలర్ను ఇప్పటి వరకు చూడలేదు’’ అన్నాడు. అతని మాటలకు బదులిచ్చిన బుమ్రా.. కపిల్ దేవ్ పేరును ప్రస్తావించాడు.
గతంలో భారత జట్టుకు నాయకత్వం వహించిన కపిల్ దేవ్ ఒక పేసర్ అని చెప్పాడు. అయితే అతను పేసర్ కాదని, ఆల్రౌండర్ అని బచర్ వివరించాడు. ‘‘సరే.. మీరు చెప్తున్నారుగా’’ అంటూ బుమ్రా సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ విషయంలో ఇద్దరిలో ఎవరిదీ పెద్దగా తప్పులేదు. కపిల్ దేవ్ ఒక ఫాస్ట్ బౌలరే.. అదే సమయంలో బ్యాటుతో కూడా మెరిసి భారత్ తరఫున అత్యుత్తమ ఆల్రౌండర్గా పేరు సంపాదించాడు. టెస్టు క్రికెట్లో 5 వేలపైగా పరుగులు చేయడమే కాకుండా, 400పైగా వికెట్లు తీసిన ఏకైక భారత ఆటగాడికా రికార్డు నెలకొల్పాడు.
England have won the toss & elected to bowl. #ENGvIND pic.twitter.com/KYG4yBEeTG
— Doordarshan Sports (@ddsportschannel) July 1, 2022