IND vs ENG 3rd Test | ఇంగ్లండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లీష్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడంతో ఈ ఫార్మాట్లో అశ్విన్ 500 వికెట్ల క్లబ్లో చేరాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్.. ఈ వికెట్ను తన తండ్రికి అంకితమిచ్చాడు. 1986లో రవిచంద్రన్, చిత్ర దంపతులకు చెన్నైలో జన్మించిన అశ్విన్.. 2010లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అశ్విన్ తండ్రి రవిచంద్రన్.. చెన్నైలో క్లబ్ స్థాయిలో ఫాస్ట్ బౌలర్గా ఆడారు. భారత్ తరఫున టెస్టులలో 500 వికెట్ల తీసిన రెండో బౌలర్గా నిలిచిన అశ్విన్.. తాను క్రికెట్ ఆడుతున్న ప్రతిసారి తండ్రికి హర్ట్ ఎటాక్ వచ్చినంత పనవుతుందని చెప్పాడు.
రెండో రోజు ఆట ముగిశాక అనిల్ కుంబ్లేతో అశ్విన్ ముచ్చటించాడు. 500 వికెట్ల క్లబ్లో చేరినందుకు అశ్విన్ను కుంబ్లే అభినందించాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ… ‘నేను ఈ 500వ వికెట్ను నా తండ్రికి అంకితమిస్తున్నాను. నా కెరీర్ ఎత్తు పల్లాలలో ఆయన ఎప్పుడూ నా వెంటే ఉన్నారు. నేను మ్యాచ్ ఆడిన ప్రతిసారి ఆయనకు హర్ట్ ఎటాక్ వచ్చినంత పని అవుతుంది. టీవీలలో నా ఆట చూసే ఆయన.. నా ప్రతి మ్యాచ్కు మద్దతుగా ఉంటాడు..’ అని అన్నాడు.
37 ఏండ్ల అశ్విన్.. ఇప్పటివరకూ భారత్ తరఫున 97 టెస్టులు ఆడి 500 వికెట్లు తీశాడు. 116 వన్డేలలో 156 వికెట్లు తీసిన ఈ తమిళ తంబి.. 65 టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. టెస్టులలో 500 వికెట్లు తీయడమే గాక బ్యాట్తనూ 3 వేలకు పైగా పరుగులు సాధించాడు.
Ravi Ashwin said – “I want to dedicate the 500th Test wicket to my father. He has been a big supporter for me throughout my career”. pic.twitter.com/Wen1A00gZG
— CricketMAN2 (@ImTanujSingh) February 16, 2024