IND vs ENG 2nd Test: ఇంగ్లండ్తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆట మూడో రోజు సూపర్ సెంచరీతో రాణించిన శుభ్మన్ గిల్ (104) తో పాటు అక్షర్ పటేల్ (45)లు మెరవడంతో రెండో ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి భారత్ ఆధిక్యం 370 పరుగులకు చేరింది. ప్రస్తుతం క్రీజులో వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (6 నాటౌట్), స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (1 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. టీ విరామానికి వెళ్లే సమయానికి భారత్.. 64 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
లంచ్ తర్వాత రెండో సెషన్లో గిల్ మూడంకెల స్కోరుదిశగా సాగాడు. 132 బంతులలో సెంచరీ పూర్తి చేసిన గిల్.. తన బ్యాటింగ్పై వస్తున్న విమర్శలకు చెక్పెట్టాడు. అక్షర్ పటేల్తో కలిసి ఐదో వికెట్కు 89 పరుగులు జోడించాడు. ఈ జోడీ భారత ఆధిక్యాన్ని 300 పరుగులను దాటించింది. అయితే సెంచరీ తర్వాత గిల్ను బషీర్ ఔట్ చేయగా అక్షర్ ను టామ్ హర్ట్లీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
It’s Tea on Day of the 2⃣nd #INDvENG Test! #TeamIndia move to 227/6 & lead England by 370 runs.
We will be back for the Third Session soon!
Scorecard ▶️ https://t.co/X85JZGt0EV @IDFCFIRSTBank pic.twitter.com/9mg0zbu3Y2
— BCCI (@BCCI) February 4, 2024
అశ్విన్ – భరత్లు మూడో సెషన్లో ఎంత ఎక్కువసేపు క్రీజులో ఉంటే భారత్కు అంత మంచిది. అలా అయితేనే ఇంగ్లండ్ ముందు 400 ప్లస్ ఆధిక్యాన్ని నిలిపే అవకాశం ఉంటుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పోరాడిన అశ్విన్ – భరత్ల ధ్వయం మూడో సెషన్లో ఏం చేస్తుందో చూడాలి మరి…!