IND vs ENG 1st Test: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో పాటు పాకిస్తాన్పై గడిచిన ఏడాదిన్నరకాలంగా స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ‘బజ్బాల్’ ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్కు.. ఇండియాలో అదంత వీజీ కాదని తొలి రోజే తెలిసొచ్చింది. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా ఆ జట్టు చూపిన ప్రభావం శూన్యం. కాస్తో కూస్తో ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ (88 బంతుల్లో 70, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే బెటర్ అనిపించిన తొలి రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట ఇంగ్లండ్ను 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తర్వాత బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. ఇంగ్లండ్ బజ్బాల్కు కౌంటర్గా భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (70 బంతుల్లో 76 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ‘జైస్బాల్’ దెబ్బను స్టోక్స్ సేనకు రుచిచూపించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 23 ఓవర్లకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్కు శుభారంభమే దక్కినా తర్వాత తడబడింది. జాక్ క్రాలే (20), బెన్ డకెట్ (35)లు ఫర్వాలేదనిపించినా తర్వాత వచ్చిన ఒలీ పోప్ ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. ఇండియా పిచ్లపై ఆడిన అనుభవమున్న జో రూట్ (29)తో పాటు బెయిర్ స్టో (38) సైతం క్రీజులో నిలవలేదు. స్టోక్స్ నిలబడ్డా అతడికి అండగా నిలిచేవాళ్లు లేకపోవడతో మూడో సెషన్కు ముందే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్ త్రయం రవీంద్ర జడేజా (3/88), రవిచంద్రన్ అశ్విన్ (3/68), అక్షర్ పటేల్ (2/33)లు రాణించారు. బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
జైస్వాల్ షో..
బంతి స్పిన్కు సహకరిస్తుండటంతో బెన్ స్టోక్స్ కూడా రెండో ఓవర్లోనే స్పిన్నర్కు బంతినిచ్చాడు. కానీ జైస్వాల్ మాత్రం ఇంగ్లండ్పై కౌంటర్ ఎటాక్కు దిగాడు. టామ్ హర్ట్లీ వేసిన ఆ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. అతడే వేసిన నాలుగో ఓవర్లో రెండు బౌండరీలు రాబట్టాడు. దీంతో 50 పరుగుల మైలురాయిని భారత్ 39 బంతుల్లోనే పూర్తిచేసింది. హర్ట్లీ వేసిన 12వ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదడంతో జైస్వాల్ అర్థ సెంచరీ పూర్తయింది. 47 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన జైస్వాల్.. హర్ట్లీ వేసిన 22 బంతుల్లో 46 పరుగులు పిండుకున్నాడు.
He has raced past FIFTY! 👏 👏
This has been a blitz of a knock from @ybj_19 to notch up his 2⃣nd Test half-century ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/HGTxXf8b1E#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Pail01CRRw
— BCCI (@BCCI) January 25, 2024
అయితే జాక్ లీచ్ వేసిన మరుసటి ఓవర్లో రోహిత్ శర్మ (24) ఔట్ అయినా జైస్వాల్ మాత్రం ఇంగ్లండ్ బౌలర్లపై దూకుడుగానే ఆడాడు. రిహాన్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో ఐదో బంతికి బౌండరీ బాదడంతో భారత స్కోరు వంద పరుగులు దాటింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్, శుభ్మన్ గిల్ (43 బంతుల్లో 14 నాటౌట్) క్రీజులో ఉన్నారు.