ఆసీస్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (11) కూడా పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి స్ట్రెయిట్ ఫోర్ బాదిన కోహ్లీ.. మరుసటి బంతిని ముందుకొచ్చి లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతని బ్యాటును తప్పించుకున్న బంతి.. లెగ్ స్టంప్ను కూల్చింది.
కోహ్లీ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. జంపా వేసిన బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన సూర్య మిస్సయ్యాడు. దీంతో ఆ బంతి అతని ప్యాడ్లను తాకింది. ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా కొంచెం ఆలోచించిన అంపైర్ అవుటిచ్చాడు. నాన్స్ట్రైకర్ ఎండ్లో రోహిత్లో ఒక్క క్షణ మాట్లాడిన సూర్య పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత జట్టు 55 పరుగుల వద్దనే మూడో వికెట్ కోల్పోయింది.