IND vs AUS | బోర్డర్ గవాస్కర్ సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఒడిసి పట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే తొలి వన్డేలో పైచేయి సాధించిన భారత్.. వైజాగ్ వేదికగా రెండో వన్డేకు సిద్ధమైంది. కానీ ఈ మ్యాచ్ అంత ఈజీగా ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు. విశాఖపట్నంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇప్పటికే మ్యాచ్ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేశారు. కానీ ఇంకా వర్షం తగ్గడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొంది.
మ్యాచ్ సజావుగా అనుకున్న సమయానికి జరగాలంటే.. మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు వర్షం తగ్గాలి. అంటే.. మధ్యాహ్నం 12:30 గంటల కంటే ముందే వరుణుడు శాంతించాలి. 12:30 గంటలు దాటిన తర్వాత కూడా వర్షం తగ్గకపోతే ఓవర్లు కుదించి మ్యాచ్ను నిలిపివేయడమా? లేదా పూర్తిగా మ్యాచ్ను రద్దు చేయడమా? చేయాల్సి వస్తుంది. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.