టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత హాజిల్వుడ్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే బౌండరీకి ఇవతలే పడిన ఆ బంతి.. ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్వెల్కు దూరంగా ఉండటంతో బౌండరీ దక్కించుకున్నాడు. ఆ మరుసటి బంతినే డీప్ స్క్వేర్ మీదుగా సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఎల్లీస్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 12 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 103 పరుగులతో నిలిచింది.
FIFTY for @klrahul 👏👏
A fine half-century for #TeamIndia vice-captain off 32 deliveries.
He also breaches the 2000 runs mark in T20Is.
Live – https://t.co/TTjqe4nsgt #INDvAUS @mastercardindia pic.twitter.com/gkuyg11PiL
— BCCI (@BCCI) September 20, 2022