సిరీస్ డిసైడర్ ఆడేందుకు హైదరాబాద్ చేరుకుంది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ పరాజయం పాలవగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా 20 ఓవర్లపాటు జరగలేదు. నాగ్పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వెట్ అవుట్ఫీల్డ్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో 8 ఓవర్లకు కుదించారు.
అయితే ఈ మ్యాచ్లో ధాటిగా ఆడిన టీమిండియా విజయం సాధించడంతో సిరీస్ 1-1తో సమం అయింది. దీంతో ఉప్పల్ వేదికగా జరిగే మూడో మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ దక్కుతుంది. ఇలాంటి సమయంలో ఉప్పల్ మ్యాచ్పై కూడా వరుణుడి ప్రభావం ఉంటుందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే ఇలాంటి భయమేమీ అక్కర్లేదని వాతావరణ శాఖ తేల్చిచెప్పింది. హైదరాబాద్లో చాలా తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని, అయితే రోజంతా మబ్బులు పట్టి ఉంటాయని తెలిపింది. ఇక్కడ ఆదివారం నాడు ఉష్ణోగ్రతలు కూడా 22-31 డిగ్రీల మధ్య ఉంటాయని పేర్కొంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.