IND vs AUS | ఆసియాకప్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన టీమిండియా.. వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్నకు ముందు మరో కీలక సిరీస్కు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి పొరు నడుస్తోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో తాము ముందుగా బౌలింగ్ చేయనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు జరిగినట్లు వెల్లడించాడు. ఈ మ్యాచ్లో పంత్ ఆడటం లేదని, భువనేశ్వర్ తిరిగి జట్టులో కలుస్తున్నాడని చెప్పాడు. గత మ్యాచ్లో భువనేశ్వర్ పక్కనపెట్టి పంత్ను ఆడించిన సంగతి తెలిసిందే. మిగతా జట్టులో మార్పులు లేవని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో కూడా ఒక మార్పు చేసినట్లు ఆ జట్టు సారధి ఆరోన్ ఫించ్ తెలిపాడు. సీన్ అబాట్ స్థానంలో జోష్ ఇంగ్లిస్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, డానియల్ శామ్స్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్
బలహీనత అనుకున్న మిడిలార్డర్ అద్భుతంగా రాణించడంతో ఆసీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాహుల్ (55), సూర్యకుమార్ (46), హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) సత్తాచాటారు. దీంతో ఆసీస్ ముందు టీమిండియా.. 209 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది. అయితే బౌలర్లు తేలిపోవడంతో ఈ భారీ లక్ష్యాన్ని కంగారూలు ఛేజ్ చేసేశారు. ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 211 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచుల టీ20 సిరీసులో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ సత్తా చాటుతున్నాడు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే తను మాత్రం పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లో బంతి అందుకున్న అతను తొలి బంతికే జోష్ ఇంగ్లిస్ (17) పెవిలియన్ చేర్చాడు.
అక్షర్ వేసిన బంతిని ఫైన్లెగ్ వైపు స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన ఇంగ్లిస్.. లెగ్ వికెట్ను ఎక్స్పోజ్ చేశాడు. అదే సమయంలో స్పిన్ అయిన బంతి.. నేరుగా వెళ్లి ఆ వికెట్ను కూల్చింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులతో నిలిచింది.
ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన స్టీవ్ స్మిత్ (35) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని స్కూప్ ఆడేందుకు ప్రయత్నించిన స్మిత్.. అది కుదరదని అర్థం కావడంతో డీప్ థర్డ్ వైపు బంతిని పంపాలని ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు. ఈ బంతిని అందుకున్న డీకే అప్పీల్ చేశాడు. అంపైర్ అవుటివ్వకపోవడంతో రోహిత్ రివ్యూ కోరాడు.
రిప్లేలో బంతి.. బ్యాటును తాకినట్లు తేలడంతో స్మిత్ కూడా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి గ్లెన్ మ్యాక్స్వెల్ (1)ను కూడా ఉమేష్ అవుట్ చేశాడు. ఉమేష్ వేసిన షార్ట్ బాల్ను పాయింట్ మీదుగా బాదేందుకు మ్యాక్స్వెల్ ప్రయత్నించి మిస్ అయ్యాడు. ఈ బంతిని అందుకున్న డీకే మరోసారి అప్పీల్ చేశాడు. అంపైర్ అవుటివ్వలేదు. రివ్యూ కోరేందుకు రోహిత్ సంకోచించగా.. డీకే కచ్చితంగా బ్యాటును బంతి తాకిందని చెప్పాడు. దీంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బ్యాటును బంతి తాకినట్లే తేలింది. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ జట్టు 123/4 స్కోరుతో నిలిచింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్కు తన కెరీర్లో తొలిసారి ఓపెనర్ అవతారమెత్తిన కామెరూన్ గ్రీన్ (30 బంతుల్లో 61) అదిరిపోయే ఆరంభం అందించాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22) అవుటైన తర్వాత వచ్చిన స్టీవెన్ స్మిత్ (23 నాటౌట్) అతనికి మంచి సహకారం అందించాడు.
దీంతో ఆసీస్ స్కోరుబోర్డు ఉరకలు పెడుతోంది. ఈ క్రమంలోనే 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు కేవలం ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. కంగారూలు గెలవాలంటే పది ఓవర్లలో మరో 100 పరుగులు చేస్తే సరిపోతుంది.
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (22), కామెరూన్ గ్రీన్ (27 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. వీళ్లిద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడటంతో భారత పేసర్లు వెలవెలబోయారు.
పవర్ప్లే స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్ ఇద్దరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్.. భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆరోన్ ఫించ్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది
ఆస్ట్రేలియా జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్ (22)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. నాలుగో ఓవర్లో బంతి అందుకున్న అక్షర్.. మూడో బంతికి ఫించ్ను పెవిలియన్ చేర్చాడు. అక్షర్ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బాదేందుకు ఫించ్ ప్రయత్నించాడు. అయితే అక్షర్ వేసిన బంతి లైన్ను మిస్ అవడంతో అది వికెట్లను కూల్చింది. దీంతో ఆసీస్ జట్టు 39 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా మొహాలీలో ఆడుతున్న తొలి మ్యాచ్లో ఆసీస్కు టీమిండియా భారీ టార్గెట్ నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46), హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్) అద్భుతంగా ఆడారు. దీంతో భారత జట్టు మెరుగైన స్కోరు చేసింది.
నాథన్ ఎల్లీస్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే దినేష్ కార్తీక్ (6) పెవిలియన్ చేరాడు. నాథన్ వేసిన బంతిని స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు డీకే ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను మిస్ అయ్యాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. రివ్యూలో అవుటని తేలడంతో డీకే నిష్క్రమించాడు. దీంతో భారత జట్టు 176 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి ఎడంచేతి వాటం బ్యాటర్ అక్షర్ పటేల్ (6) పెవిలియన్ చేరాడు. నాథన్ ఎల్లీస్ వేసిన 16వ ఓవర్లో అక్షర్ అవుటయ్యాడు.
ధాటిగా ఆడుతన్న సూర్యకుమార్ యాదవ్ (46) హాఫ్ సెంచరీకి అడుగుదూరంలో పెవిలియన్ చేరాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి హార్దిక్ పాండ్యా సిక్సర్ బాదాడు. అదే ఓవర్ మూడో బంతి ఎక్స్ట్రా బౌన్స్ అయింది. అది సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. బంతిని డీప్ థర్డ్ దిశగా పంపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ మాథ్యూ వేడ్ పట్టేసుకున్నాడు. భారత జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగులతో నిలిచింది.
Surya Kumar departs after scoring 46 off 25 balls!
He is certainly the best Indian T20I player currently!
Green with the wicket!#INDvsAUS #INDvAUS pic.twitter.com/Yp0hHgTm5z
— Sportz Point (@sportz_point) September 20, 2022
టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న వెంటనే పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్.. 32 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత హాజిల్వుడ్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బౌండరీకి ఇవతలే పడిన ఆ బంతి.. ఫీల్డింగ్ చేస్తున్న మ్యాక్స్వెల్కు దూరంగా ఉండటంతో బౌండరీ దక్కించుకున్నాడు. ఆ మరుసటి బంతినే డీప్ స్క్వేర్ మీదుగా సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఎల్లీస్కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
FIFTY for @klrahul 👏👏
A fine half-century for #TeamIndia vice-captain off 32 deliveries.
He also breaches the 2000 runs mark in T20Is.
Live - https://t.co/TTjqe4nsgt #INDvAUS @mastercardindia pic.twitter.com/gkuyg11PiL
— BCCI (@BCCI) September 20, 2022
ఆరంభంలోనే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (2) పెవిలియన్ చేరినా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (23 నాటౌట్) ఇద్దరూ ధాటిగా ఆడారు. దీంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 86/2 స్కోరుతో నిలిచింది
50-run partnership comes up between @klrahul & @surya_14kumar 🙌🙌
After 10 overs #TeamIndia are 86/2
Live - https://t.co/TTjqe4nsgt #INDvAUS @mastercardindia pic.twitter.com/bAkwa6YcrU
— BCCI (@BCCI) September 20, 2022
కోహ్లీ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్.. వచ్చీరావడంతోనే ఫోర్, సిక్స్ బాదడంతో భారత జట్టు పవర్ప్లే ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో నిలిచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (11) అవుటైన కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (2) కూడా అవుటయ్యాడు. నాథన్ ఎల్లీస్ వేసిన ఐదో ఓవర్లో ఇన్నింగ్స్ వేగం పెంచేందుకు ప్రయత్నించిన కోహ్లీ.. మిడాన్ మీదుగా బంతిని తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతను అనుకున్నంత ఎత్తు ఎగర్లేదు. దీంతో ఇన్ఫీల్డ్లో ఉన్న కామెరూన్ గ్రీన్కు చాలా సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు
టీమిండియా స్టార్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (11) మూడో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. హాజిల్వుడ్ వేసిన ఆ ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ భారీ సిక్సర్ బాదాడు. అదే ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. టైమింగ్ మిస్ అయ్యాడు. దీంతో నాథన్ ఎల్లీస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చాలా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన ఎల్లీస్ అద్భుతంగా అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత జట్టు మూడు ఓవర్లు ముగిసేసరికి 25/1 స్కోరుతో నిలిచింది.
భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ సారధి ఆరోన్ ఫించ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో పంత్ను పక్కనపెట్టిన టీం మేనేజ్మెంట్ ఫినిషర్ దినేష్ కార్తీక్కు అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా జట్టులో కామ్ గ్రీన్ ఓపెనింగ్ చేస్తున్నట్లు ఫించ్ తెలిపాడు.
🚨 Toss Update 🚨
Australia have elected to bowl against #TeamIndia in the first #INDvAUS T20I.
Follow the match 👉 https://t.co/ZYG17eC71l pic.twitter.com/jxRYDRl9Bk
— BCCI (@BCCI) September 20, 2022
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లీస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్