IND vs AUS | నిర్ణయాత్మక మ్యాచ్లో ఎలాగైనా గెలిచి వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్లో దూకుడు చూపించింది. భారత్తో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఆస్ట్రేలియా 269 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా ముందు 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. మొదటి 10 ఓవర్లకే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33), మిచెల్ మార్ష్ (42) ఇద్దరూ 61 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ విఫలమయ్యాడు. ఒక్క పరుగు కూడా తీయకుండానే పెవిలియన్ చేరాడు. స్మిత్ తర్వాత వచ్చిన డేవిడ్ వార్నర్ (23), మార్నస్ లబుషేన్ (28), స్టాయినిస్ (25), అలెక్స్ కెరీ (38) నిలకడగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించారు. సీన్ అబాట్ (26), అగర్ (17) ఫర్వాలేదనిపించారు. చివరగా ఆడమ్ జంపా (10), మిచ్చెల్ స్టార్ (10) కూడా రాణించారు. ఫలితంగా 49 ఓవర్లలో 269 పరుగుల వద్ద ఆలౌటైంది. టీమిండియా ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ను కూడా దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిందే.