IND vs AUS 1st Test: భారత్ – ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆరంభ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయిన భారత్.. తర్వాత కెఎల్ రాహుల్ (78 బంతుల్లో 55 నాటౌట్, 6 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 34 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) లు నిలకడగా ఆడుతూ భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. లంచ్ సమయానికి భారత్.. 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 119-1 వద్ద ఆట ఆరంభించిన భారత్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (74 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) వికెట్ను కోల్పోయింది. జో రూట్ వేసిన తొలి ఓవర్లోనే జైస్వాల్.. అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫామ్ అందుకోవడానికి తంటాలు పడుతున్న శుభ్మన్ గిల్ (66 బంతుల్లో 23, 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. గిల్ను.. టామ్ హర్ట్లీ పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 159 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది.
Lunch on Day 2 in Hyderabad 🍱
An unbeaten 50-run stand between KL Rahul (55*) & Shreyas Iyer (34*) take #TeamIndia to 222/3 👏👏
See you 🔜 for the afternoon session
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ogCs9kfuiH
— BCCI (@BCCI) January 26, 2024
గిల్ నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో కలిసి రాహుల్ నిలకడగా ఆడుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి అభేద్యమైన నాలుగో వికెట్కు 63 పరుగులు జోడించారు. నలుగురు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. రూట్, లీచ్, హర్ట్లీతో పాటు జో రూట్ల బౌలింగ్లో పరుగులు రాబట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్.. ఇంకా 24 పరుగులు (ఇంగ్లండ్.. 246) వెనుకబడి ఉంది. తొలి సెషన్లో భారత్.. 27 ఓవర్లలో 103 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.