ఆసియా కప్లో భాగంగా జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు కేఎల్ రాహుల్ (62), విరాట్ కోహ్లీ (122 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. సూర్యకుమార్ యాదవ్ (6) విఫలమవగా.. రిషభ్ పంత్ (16 బంతుల్లో 20 నాటౌట్) వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు.
అయితే మరో ఎండ్లో కోహ్లీ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడటంతో భారత జట్టు 212/2 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఆ జట్టును భువనేశ్వర్ (5/4) దెబ్బకొట్టాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అఫ్ఘాన్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
భువీ రెచ్చిపోవడంతో హజ్రతుల్లా జజాయ్ (0), రహ్మనుల్లా గుర్బాజ్ (0), కరీమ్ జనత్ (2), నజిబుల్లా జద్రాన్ (0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇబ్రహీం జద్రాన్ (64 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. అతనికి సహకారం అందించడంలో కెప్టెన్ మహమ్మద్ నబీ (7), అజ్మతుల్లా ఒమర్జాయ్ (1) విఫలమయ్యారు.
రషీద్ ఖాన్ (15), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (18) కాసేపు సహకారం అందించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇది టీ20ల్లో భారత్కు రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. భారత బౌలర్లలో భువీ ఐదు వికెట్లతో చెలరేగగా.. అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా తలో వికెట్ తీసుకున్నారు.
A massive win for India in Dubai 👏🏻#AsiaCup2022 | #INDvAFG | Scorecard: https://t.co/z8iw8dn85Q pic.twitter.com/rdigrI6H5V
— ICC (@ICC) September 8, 2022