Rohit Sharma | ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ-2023 మ్యాచ్లో భారత్ సారధి రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించారు. ఆప్ఘనిస్థాన్పై జరిగిన మ్యాచ్లో భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి. 15 ఓవర్లు మిగిలి ఉండగానే 273 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకున్నది.
ఈ మ్యాచ్లో ఐదు సిక్స్లు, 16 ఫోర్లతో 131 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఇంటర్నేషనల్ క్రికెట్లో క్రిస్ గేల్ రికార్డునే దాటేశాడు. బ్రెండన్ మెకల్లం 432 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 398 సిక్సర్లు బాదితే.. షాహిది అఫ్రిది 524 మ్యాచ్ల్లో 476 సిక్సర్లు, క్రిస్ గేల్ 483 మ్యాచ్ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. బుధవారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ తో 453 అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లు ఆడిన రోహిత్ శర్మ 453 మ్యాచ్ ల్లోనే 555 సిక్సర్లు బాదిన సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఓడిఐ క్రికెట్లో 50 ఓవర్ల మ్యాచ్లో 300 సిక్సర్లకు చేరువలో రోహిత్ శర్మ నిలిచారు. ఇప్పటి వరకూ ఆ ఫార్మాట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు ఇద్దరే. ఒకరు క్రిస్ గేట్ 331 సిక్సర్లు బాదితే, షాహిది అఫ్రిది 351 సిక్సర్లు కొట్టాడు. టీ-20 మ్యాచ్ ల్లో అత్యధికంగా 183 సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్టిల్ కంటే తొమ్మిది సిక్స్లు ఎక్కువ.
వరల్డ్ కప్ టోర్నమెంట్లో 1000 పరుగులు దాటిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిపాడు. వరల్డ్ కప్ టోర్నీలో 1000కి పైగా పరుగులుచేసిన భారత్ బ్యాటర్లలో రోహిత్ శర్మ నాలుగోవాడు. సౌరవ్ గంగూలీ 1006 పరుగులు చేశాడు. 19 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు.