అమరావతి: న్యూజిలాండ్లో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్లో భారత్ , న్యూజిలాండ్ మధ్య సెడ్డెన్ పార్కు స్టేడియంలో జరుగుతున్న పోటీలో టాస్ గెలిచిన భారత్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ 50 ఓవర్ల వరకు 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.
భారత బౌలింగ్లో పూజా వస్త్రాకర్ పది ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి 34 పరుగులు ఇచ్చింది. రాజేశ్వరీ గ్రైక్వాడ్ 2, దీప్తి శర్మ , గోస్వామి చెరో వికెట్ పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టులో అమెలియా కెర్50, అమీ సట్టెర్త్వైట్ 75, మార్టిన్ 41, సోఫీ డివైన్ 35 పరుగులు సాధించింది.