బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నది. శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్ల్లో గెలుపు కోసం జట్లు కడదాకా ప్రయత్నించాయి. వరుస విజయాలతో జోరు మీద కనిపించిన మాజీ చాంపియన్ జైపూర్ పింక్పాంథర్స్కు తమిళ్ తలైవాస్ అదిరిపోయే ఝలక్ ఇచ్చింది.
ఓటములకు స్వస్తి పలుకుతూ జైపూర్పై 38-27 తేడాతో తలైవాస్ అద్భుత విజయం సాధించింది. తలైవాస్ తరఫున రైడర్ నరేందర్ 13 పాయింట్లతో విజృంభించాడు. నరేందర్కు తోడు అజింక్యా పవార్(6) రాణించడంతో తలైవాస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిగతా మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్, పుణెరీ పల్టాన్ మధ్య పోరు 27-27తో డ్రాగా ముగియగా, పాట్నా పైరేట్స్ 34-29తో యూపీ యోధాస్పై ఉత్కంఠ విజయం సాధించింది.