ICC : ప్రపంచ టెస్టు చాంపియన్షి(WTC).. టెస్టు క్రికెట్కు కొత్త జీవం, సరికొత్త కళ తీసుకొచ్చింది. వన్డే, టీ20ల యుగంలో ఆదరణ కోల్పోతున్నఐదు రోజుల ఆటకు మళ్లీ ఊపిరి పోసింది. ఈ ఏడాది ఫైనల్ బెర్తు కోసం అన్ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరికి.. భారత్(India), ఆస్ట్రేలియా (Australia) జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాయి. 2021-23 మధ్య కాలంలో రసవత్తరంగా సాగిన ఐదు టెస్టులను ఐసీసీ (ICC) అత్యుత్తమ మ్యాచ్లుగా ఎంపిక చేసింది. వాటిలో న్యూజిలాండ్, శ్రీలంక మధ్య క్రిస్ట్చర్చ్లో జరిగిన టెస్టు ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ చిరస్మరణీయ విజయం సాధించిందని ఐసీసీ పేర్కొంది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్లో కివీస్ ఆఖరి బంతికి గెలుపొందింది.
ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ – ఇంగ్లండ్ (రావల్పిండి, 2022) టెస్టు ఉంది. శ్రీలంక – పాకిస్థాన్ (గాలే, 2022) మ్యాచ్ మూడో స్థానంలో నిలిచింది. 2022లో బర్మింగ్హమ్ స్టేడియంలో ఇంగ్లండ్ – భారత్ మధ్య జరిగిన టెస్టుకు నాలుగో ప్లేస్ దక్కింది. 2021లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన కాన్పూర్ టెస్టు ఐదో బెస్టు మ్యాచ్గా ఎంపికైంది. క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఈ ఐదు టెస్టులను ఐసీసీ బెస్ట్ మ్యాచ్లుగా పరిగణనలోకి తీసుకుంది.
ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఇంగ్లండ్లోని ఓవల్(Oval) స్టేడియం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు ఫైనల్ పోరు జరగనుంది. 2021 ఫైనల్లో కంగుతిన్న టీమిండియా ఈసారి టెస్టు గదను ముద్దాడాలనే కసితో ఉంది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ టెస్టు చాంపియన్గా అవతరించాలని భావిస్తోంది. అయితే.. ఇరుజట్లు ఎదురుపడిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భారత్ పైచేయి సాధించింది. 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. దాంతో, ఫైనల్లో ఆసీస్పై టీమిండియా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.