దుబాయ్: వన్డే ప్రపంచకప్లో దంచికొడుతున్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఏడో స్థానానికి చేరాడు. మెగాటోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన పోరులో కోహ్లీ.. 85 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ఒక ర్యాంక్ మెరుగు పరుచుకున్నాడు.
భారత్ నుంచి గిల్ అత్యుత్తమంగా రెండో ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో సిరాజ్ రెండో ప్లేస్లో ఉండగా.. కుల్దీప్ యాదవ్ ఒక ర్యాంక్ మెరుగు పరుచుకొని ఎనిమిదో ప్లేస్కు చేరాడు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా ఏడో స్థానంలో ఉన్నాడు.