ICC : అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్ధలు కొట్టడం, రివార్డులు కొల్లగొట్టడంలో తమకు తిరుగులేదని భారత క్రికెటర్లు(Indian Cricketers) మరోసారి నిరూపించారు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టు (T20 Team Of The Year 2023)లో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఎంపికవ్వగా.. తాజాగా వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్(ODI Team Of The Year 2023)లోనూ ఆరుగురు భారత క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు.
నిరుడు అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. ఈ టీమ్కు రోహిత్ శర్మ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ ఓపెనర్గా ఎంపికయ్యారు. నిరుడు ఆసియా కప్తో పాటు వన్డే ప్రపంచ కప్లో సెంచరీల మోత మోగించిన విరాట్ కోహ్లీ, బంతితో మాయ చేసిన కుల్దీప్ యాదవ్, సిరాజ్, షమీలు 11 మందిలో చోటు దక్కించుకున్నారు. నిరుడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాల నుంచి ఏకంగా ఎనిమిది మంది ఈ జట్టుకు ఎంపికవ్వడం విశేషం.
Eight players that featured in the #CWC23 Final have made the cut for the ICC Men’s ODI Team of the Year in 2023 ✨
Details 👇https://t.co/AeDisari9B
— ICC (@ICC) January 23, 2024
వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), మార్కో జాన్సేన్, ఆడం జంపా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షహీ.
టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, సికందర్ రజా, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ ఎంగర్వ, అర్ష్దీప్ సింగ్.