చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ(Dhoni) .. తన క్రికెట్ కెరీర్పై కీలక విషయాన్ని వెల్లడించారు. తన కెరీర్ చివరి దశలో ఉన్నట్లు చెప్పాడు. ఐపీఎల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇదే తన కెరీర్లో చివరి దశ అని పేర్కొన్నాడు.
ధోనీ డగౌట్లోకి రాగానే క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో అరుపులు, కేకలు పెట్టారు. ఎంత సుదీర్ఘ కాలం ఆడినా.. ఇదే తన కెరీర్లో చివరి ఫేజ్ అని తెలిపాడు. రెండేళ్ల తర్వాత అభిమానులు మళ్లీ స్టేడియానికి వస్తున్నారని, ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు తమపై ఎంతో ఆదరాభిమానులు చూపిస్తున్నట్లు చెప్పాడు.