కొచ్చి: ఒలింపిక్స్లో ఇండియా నాలుగు దశాబ్దాల తర్వాత హాకీ ( Hockey ) మెడల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్. అయితే ఇలాంటి విజయాలు ఊరికే రావు. దాని వెనుక ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మొన్న వెయిట్లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ గెలిచిన మీరాబాయి చాను తెలుసు కదా. ఆమె గడిచిన ఐదేళ్లలో ఐదుసార్లు కూడా తాను ఇంటికి వెళ్లలేదని మెడల్ గెలిచిన తర్వాత చెప్పుకొచ్చింది. ఇప్పుడు శ్రీజేష్ విషయంలోనూ అదే జరిగింది. ఈ విజయంపై అతని భార్య అనీషా స్పందిస్తూ.. తాను 6 నెలలుగా తన భర్తను చూడలేదని చెప్పింది.
అతడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తున్నానని, రాగానే హాలీడే ట్రిప్ ప్లాన్ చేయనున్నట్లు ఆమె తెలిపింది. తమ జీవితాల్లో ఇంతకు మించిన సంతోషం మరొకటి లేదని అనీషా చెప్పింది. ఒలింపిక్స్లో ఇండియన్ టీమ్ విజయంలో శ్రీజేష్ కీలకపాత్ర పోషించాడు. కీలక సమయాల్లో అతడు ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా అడ్డుకోగలిగాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్లోనూ మరో ఆరు సెకన్లలో ముగుస్తుందనగా.. జర్మనీ పెనాల్టీ కార్నర్ను సమర్థంగా అడ్డుకున్నాడు.