బెంగళూరు: హైదరాబాద్కు చెందిన రష్మిక శ్రీవల్లి తొలి ఐటీఎఫ్ టైటిల్ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో జీల్ దేశాయ్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో రష్మికకు 3935 డాలర్ల(రూ.3.27 లక్షలు)తోపాటు 50 డబ్యుటీఏ పాయింట్లు దక్కాయి. రెండో గేమ్లో బ్రేక్ సాధించిన రష్మిక ఒక్క గేమ్నుకూడా వదులుకోకుండా తొలి సెట్ను దక్కించుకుంది.
రెండో సెట్లో తొలి గేమ్ను కోల్పోయిన రష్మిక వరుసగా నాలుగు, అయిదు గేమ్లను గెలుచుకుని 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే జీల్ వరుసగా మూడు గేమ్లు గెలుచుకుని 5-3 ఆధిక్యం సాధించి అనంతరం సెట్నుకూడా దక్కించుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో ఆరంభంలోనే 3-0 ఆధిక్యం సాధించిన రష్మిక దానిని నిలబెట్టుకుంటూ6-3తో సెట్ను, మ్యాచ్ను, టైటిల్ను సొంతం చేసుకుంది.