కైరో: ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ షూటర్ ఇషాసింగ్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మహిళల జూనియర్ 25మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఇషాసింగ్ పసిడి పతకంతో మెరిసింది. ఆఖరివరకు హోరాహోరీగా సాగిన పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఇషా(29) అగ్రస్థానంలో నిలువగా, ఫెంగ్ జుయాన్(25), జాకో మిరామ్(18) వరుసగా రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. మరోవైపు యుధ్వీర్ సిద్ధు పురుషుల జూనియర్ 25 మీటర్ల పిస్టల్ విభాగంతో పాటు స్టాండర్డ్ పిస్టల్ కేటగిరీలో రెండు పసిడి పతకాలు దక్కించుకున్నాడు.