హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తు చేసింది.
మొదట మేఘాలయ 20 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 13.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 120 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ (41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తన్మయ్ (46 నాటౌట్) ఆకట్టుకున్నారు.