హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి వేదిక కాబోతున్నది. నవంబర్ 5వ తేదీన నెక్లెస్రోడ్లో ఐఏయూ 50కి.మీల ప్రపంచ చాంపియన్షిప్ జరుగనుంది. భారత్ తొలిసారి ఈ రేసుకు ఆతిథ్యమిస్తున్నది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అల్ట్రా రన్నర్స్(ఐఏయూ), జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) సహకారంతో ఎన్ఈబీ స్పోర్ట్స్ ఈ మారథాన్ను నిర్వహిస్తున్నది.
ఇందులో భారత్ సహా అమెరికా, జర్మనీ, జపాన్, చైనీస్తైపీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్ నుంచి పలువురు ప్రముఖ అథ్లెట్లు పోటీ పడుతున్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో నిర్వాహకులు మీడియాతో పలు అంశాలను పంచుకున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, గోపీచంద్..రేసును ప్రారంభించనున్నారు.