హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో హెచ్సీఏ కొనసాగుతున్నది.
అయితే మంగళవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా భేటీలో సీఆర్పీఎఫ్ మాజీ డీజీ దుర్గాప్రసాద్ పలు అంశాలపై మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణతో పాటు స్టేడియంలో మౌలిక వసతులు, ఎన్నికల ప్రక్రియ, ఎక్సలెన్సీ సెంటర్, డార్మెటరీపై మీడియాకు ఆయన వివరించారు.