హైదరాబాద్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన ‘హైదరాబాద్ జిల్లా చాంపియన్షిప్’ టోర్నీలో యువ షట్లర్లు భవేష్ రెడ్డి, సాయిష్ జోడీ విజేతగా నిలిచారు. ఈనెల 20న మాధాపూర్లోని గేమ్పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో అండర్ 13, 15, 17, 19 విభాగాల్లో పోటీలను నిర్వహించగా.. అండర్ 13 బాలుర డబుల్స్ ఫైనల్లో భవేష్ రెడ్డి, సాయిష్ ద్వయం 21-14, 21- 19 తో దర్శ్ గోయల్, ద్రువ్సింగ్ జంటపై అద్భుత విజయం సాధించారు.
ఈ విజయంతో భవేశ్-సాయిష్ రాష్ట్రస్థాయి టోర్నీలకు అర్హత సాధించారు. అంతకుముందు అండర్ 13 సింగిల్స్ విభాగంలో.. క్రిషవ్ 21-10, 21-16తో భవేష్పై విజయం సాధించడంతో అతడు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఈ పోటీలలో విజేతలకు ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరినాథ్, తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు.