Indonesian Open : ఇండోనేషియా సూపర్ 1000 ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు హెచ్హెస్ ప్రణయ్(HS Pranay), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) జోరు కొనసాగిస్తున్నారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. మలేషియా మాస్టర్స్(Malaysia Masters)లో సత్తా చాటిన వీళ్లు పతకం దిశగా మరో అడుగు ముందుకేశారు. 7వ సీడ్ ప్రణయ్ అంగుస్ కా లాంగ్(హాంకాంగ్)పై 43 నిమిషాల్లోనే విజయం సాధించాడు. వరుస సెట్లలో 21-18, 21-16తో లాంగ్ను చిత్తు చేశాడు. శ్రీకాంత్ 21-17, 22-20తో లక్ష్యసేన్(Lakshya Sen)పై గెలుపొందాడు.
మరో భారత ఆటగాడు ప్రియాన్షు రజావత్(Priyanshu Rajawat) ఓటమితో నిష్క్రమించాడు. రెండో సీడ్ ఆంథోని గింటింగ్ చేతిలో 22-20, 15-21, 15-21 పోరాడి ఓడిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ప్రియాన్షు ఒర్లియాన్ మాస్టర్స్ టైటిల్ సాధించాడు. అంతేకాదు థామస్ కప్ విజేతగా నిలిచిన జట్టులో అతను సభ్యుడు.
ప్రియాన్షు రజావత్
మహిళల సింగిల్స్లో తెలగు తేజం పీవీ సింధు(PV Sindhu) అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగింది. చైనీస్తైపీ క్రీడాకారిణి థాయ్ జూ(Tai Tzu Ying) చేతిలో 21-18, 21-16తో ఓటమి పాలైంది. ఆట ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన థాయ్, సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ ఒలింపిక్ పతక విజేత ఓటమితో మహిళల సింగిల్స్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. డబుల్స్లో సాత్విక్ – చిరాగ్ శెట్టి జోడీ కూడా క్వార్టర్లో అడుగుపెట్టింది.