ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫామ్లో ఉన్నఆటగాళ్లలో సూర్యకుమార్ ఒకడు. భారత జట్టులో టాప్-4 ఆటగాళ్లు రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్య అందరూ సూపర్ ఫామ్లో కనిపిస్తున్నారు. అయితే వీళ్లందరిలో సూర్య టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. సౌతాఫ్రికాతో గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో సూర్య చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే 61 పరుగులు చేసి అదరగొట్టాడు.
ఈ మ్యాచ్ అనంతరం అతని గురించి కామెంటేటర్ హర్ష భోగ్లే ఒక ప్రశ్న అడిగాడు. ‘సూర్య ఫామ్ను ఎలా కాపాడాలని అనుకుంటున్నారు? అతను ఉన్న ఫామ్ చూస్తుంటే.. జస్ట్ దాన్ని కాపాడండి. అసలు ఎలా దాన్ని భద్రంగా ఉంచాలని అనుకుంటున్నారు?’అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న టీమిండియా సారధి రోహిత్ శర్మ నవ్వేశాడు.
‘ఇక్కడి నుంచి అతన్ని ఆడించకుండా డైరెక్టుగా అక్టోబర్ 23న బరిలో దించాలని అనుకుంటున్నా’ అని జోక్ చేశాడు. అక్కడితో ఆగకుండా.. ‘సీరియస్గా సూర్య ఉన్న ఫామ్ చూడండి. తను ఎప్పుడైనా సరే మైదానంలో దిగి ఆడాలని అనుకుంటాడంతే. అలా చేస్తేనే అతనికి సంతోషంగా ఉంటుంది. మేం కూడా తనను సంతోషంగా ఉంచాలనే అనుకుంటున్నాం’ అని వివరించాడు.
బుధవారం రోజున సఫారీలతో మూడో టీ20 ఆడిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా బయలుదేరుతుంది. అక్కడ టీ20 ప్రపంచకప్ ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడుతుంది. అనంతరం పాకిస్తాన్తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడనుంది.