దుబాయ్: చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఉండే క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. అందులో భాగంగా అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. మెగాటోర్నీకి సంబంధించిన టికెట్లను ఐసీసీ సోమవారం ప్రేక్షకులకు అందుబాటులోకి తేగా.. గంటల వ్యవధిలోనే దాయాదుల మ్యాచ్ టికెట్లు హాట్కేకుల్లా అముడైపోయాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆసీస్లోని ఏడు మైదానాల్లో మ్యాచ్లు జరుగనుండగా.. లక్షమంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న మెల్బోర్న్లో భారత్, పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.