HCA : వన్డే వరల్డ్ కప్ ముగియడంతో క్రికెట్ దేశాలన్నీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023-25)పై దృష్టి పెట్టాయి. దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)లో చారిత్రాత్మక విజయంతో టెస్టు సిరీస్ సమం చేసిన భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్(England)ను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. బెన్ స్టోక్స్ సేనతో రోహిత్ బృందం ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇరుజట్ల మధ్య హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జనవరి 25న తొలి మ్యాచ్ జరుగునుంది.
ఈ మ్యాచ్కు ముందు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక కుటుంబాలకు ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. మరుసటి రోజు గణతంత్ర దినోత్సవం(Republic Day) ఉన్నందున సైనికుల గౌరవార్థం వాళ్ల కుటుంబాలను ఫ్రీగా అనుమతించనుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి, కాలేజీల్లో 12వ క్లాస్ వరకు చదివే విద్యార్థులను స్టేడియంలోకి ఉచితంగా అనుమతిస్తున్నట్టు హెచ్సీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.
HCA INVITED STUDENTS (CLASS VI-XII) FROM ALL GOVT. RECOGNISED SCHOOLS IN TELANGANA TO WATCH INDIA VS ENGLAND TEST MATCH FOR FREE AT UPPAL STADIUM WHICH WILL BE HELD BETWEEN JANUARY 25 AND 29#hydca #hca #INDvsENG #testmatch #Cricket #rajivgandhiinternationalstadium pic.twitter.com/VIUvpRKh6P
— hydcacricket (@hydcacricket) January 15, 2024
భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ టికెట్లు జనవరి 18 నుంచి అమ్మనున్నారు. పేటీఎమ్ ఇన్సైడర్(Paytm Insider) యాప్లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఆఫ్లైన్లో టికెట్లను సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో అమ్ముతారు. మ్యాచ్ టికెట్ ధర రూ.200 నుంచి రూ. 4 వేల మధ్య ఉండనుంది.