న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రపంచకప్లో డిఫెండర్ హర్మన్ప్రీత్ సింగ్.. భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఒడిశా వేదికగా జరుగనున్న ఈ మెగాటోర్నీ కోసం శుక్రవారం భారత హాకీ సమా ఖ్య 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ‘తాజా ఫామ్తో పాటు ఆటగాళ్లలో ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక చేశాం’ అని సెలెక్టర్లు పేర్కొన్నారు.