ICC Rankings | భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందన.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ఒక్కో స్థానం కోల్పోయారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హర్మన్ప్రీత్ ఓ ర్యాంక్ కోల్పోయి ప్రస్తుతం ఆరో స్థానంలో నిలువగా.. వైస్ కెప్టెన్ స్మృతి మందన ఏడో ర్యాంక్కు చేరింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం మహిళల వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది.
టీ20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో భారత స్పిన్నర్ దీప్తి శర్మ మూడో స్థానం దక్కించుకుంది. దూకుడుకు మారుపేరైన హర్మన్ప్రీత్ 716 పాయింట్లు సాధిస్తే.. స్మృతి 714 ర్యాంకింగ్ పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (758 పాయింట్లు) బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి లంక ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది.
బౌలర్ల జాబితాలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ఎనిమిదో ర్యాంక్ దక్కించుకోగా.. ఆఫ్ స్పీన్నర్ దీప్తి శర్మ 10 ప్లేస్లో నిలిచింది. ఇంగ్లండ్ పేసర్ సోఫియా ఎకెల్స్టోన్ 751 ర్యాంకింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆల్రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ 322 పాయింట్లతో ఆరో ర్యాంక్ దక్కించుకుంది. టీ20 ర్యాంకింగ్స్లో స్టార్ ఓపెనర్ స్మృతి మందన మూడో ప్లేస్ దక్కించుకోగా.. బౌలింగ్ విభాగంలో దీప్తి (4వ), రేణుక సింగ్ (9వ) టాప్-10లో చోటు దక్కించుకున్నారు. పొట్టి ఫార్మాట్ ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి మూడో స్థానంలో నిలిచింది. మూడు వన్డేలు, 3 టీ20లు ఆడేందుకు ఈ నెలలో భారత జట్టు బంగ్లాదేశ్తో పర్యటించనుంది.