T20 Series : ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు(Team India) సొంత గడ్డపై తొలి సవాల్కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో రేపటి నుంచి మొదలయ్యే మూడు టీ20 సిరీస్ కోసం హర్మన్ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన నెట్స్లో చెమటోడ్చుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం కెప్టెన్ హర్మన్ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేశారు.
పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, టిటస్ సాధులు బౌలింగ్పై దృష్టి పెట్టారు. మరోవైపు హీథర్ నైట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ కూడా విజయంతో సిరీస్ను ఆరంభిచాలనే పట్టుదలతో ఉంది. వాంఖడేలోనే ఇరుజట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 9న, మూడో టీ20 డిసెంబర్ 10న జరుగనుంది. పొట్టి సిరీస్ అనంతరం రెండు టెస్టుల సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.
భారత టీ20 స్క్వాడ్ : హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తికా భాటియా(వికెట్ కీపర్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటస్ సాధు, పూజా వస్త్రాకర్, కణికా ఆహుజా, మిన్ను మణి.