Haris Rauf : పాకిస్థాన్ స్టార్ పేసర్ హ్యారిస్ రవుఫ్ (Haris Rauf) గాయం కారణంగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)కు దూరమైన విషయం తెలిసిందే. వరుస గాయలతో సతమతమవుతున్న అతడు తాజాగా తన సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract) విషయమై ఆ దేశ క్రికెట్ బోర్డును ఆశ్రయించాడు. తన కాంట్రాక్ట్ను పునరుద్దరించాల్సిందిగా బోర్డు పెద్దలను కోరాడు.
దాంతో, బోర్డు సానుకూలంగా స్పందించిందినట్టు సమాచారం. త్వరలోనే అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ను పీసీబీ పునరుద్దరించే అవకాశం ఉంది. హ్యారిస్ రవుఫ్ విజ్ఞప్తిని బోర్డు అంగీకరించే చాన్స్ ఉంది. అదే జరిగితే అతడు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్లోకి వస్తాడు అని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు.
పాక్ పేస్ త్రయంలో ఒకడైన హ్యారిస్ నిరుడు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో ఆడకుండా బిగ్ బాష్ లీగ్(BBL 2023)కు వెళ్లాడు. దాంతో, ఆగ్రహించిన పాక్ బోర్డు అతడి కాంట్రాక్ట్ను రద్దు చేసింది. అనంతరం స్వదేశంలో జరుగుతున్న పీఎస్ఎల్లో రవుఫ్ గాయపడ్డాడు.
లాహోర్ క్యాలండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు ఫిబ్రవరి 23న కరాచీ కింగ్స్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. స్కానింగ్ పరీక్షల్లో అతడి భుజం ఎముక కొంచెం పక్కకు జరిగినట్టు తేలింది. దాంతో, ఈ స్పీడ్స్టర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మరో రెండు నెలల్లో పొట్టి ప్రపంచకప్ ఉందనగా రవుఫ్ గాయడడంతో పాక్ శిబిరంలో ఆందోళన పెంచింది.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే హైటెన్షన్ ఉంటుంది. చిరకాల ప్రత్యర్థుల పోరులో టీమిండియా పైచేయి సాధిస్తూ వస్తోంది. అయితే.. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో మాత్రం పాక్ ఆ రికార్డు బ్రేక్ చేస్తుందనిపించింది.
విరాట్ కోహ్లీ, రవుఫ్
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రవుఫ్ వేసిన 19వ ఓవర్లో విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. ఐదో బంతిని హ్యారిస్ తల మీదుగా స్టాండ్స్లోకి పంపించాడు. ఆ తర్వాత బంతిని స్కూప్ షాట్తో సిక్సర్గా మలిచాడు. 160 టార్గెట్ ఛేదనలో అతను 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.