IND vs PAK | భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే.. భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయనేది తెలిసిన విషయమే! సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడంతో.. కేవలం ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారు. దీంతో భారత్, పాక్ మ్యాచ్ అంటే ప్లేయర్లపై కొండంత ఒత్తిడి నెలకొనడం సహజమే. ఆసియాకప్లో భాగంగా జరుగుతున్న భారత్, పాక్ మ్యాచ్లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. మెరుగైన బౌలింగ్తో భారత్ టాపార్డర్ను దెబ్బకొట్టిన పాక్ పేసర్లకు మిడిల్లో ఇషాన్, హార్దిక్ కొరుకుడు పడని కొయ్యలా మారి విసిగించారు. తీవ్ర ఒత్తిడిలోనూ సంయమనంతో ఆడిన ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 141 బంతుల్లో 138 పరుగులు జోడించారు. దీంతో భారత్ కోలుకోగా.. ఈ జోడీని విడదీసేందుకు పాక్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు సెంచరీకి చేరువైన ఇషాన్.. హరిస్ రవుఫ్ బౌలింగ్లో కెప్టెన్ బాబర్ ఆజమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సమయంలో రవుఫ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.
#PAKvIND #AsiaCup2023 #ShaheenAfridi #HarisRauf
This will be remembered…❤🔥 pic.twitter.com/FgZbx0818o— Ab Kitna Yaad Thayenge?? (@choachvor) September 2, 2023
చక్కటి ఇన్నింగ్స్తో భారత్కు మంచి స్కోరు అందించిన ఇషాన్పై రవుఫ్ కోపంతో ఊగిపోయాడు. అతడి వికెట్ తీసిన ఆనందంలో చేతిని పెవిలియన్ వైపు చూపుతూ.. ‘వెళ్లూ, బయటకు వెళ్లు (నికల్.. బాహర్ నికల్)’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇదంతా గమనించి కూడా మౌనంగా ఉన్న టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత బ్యాట్తోనే రవుఫ్కు సమాధానం చెప్పాడు. అతడి తదుపరి ఓవర్ (ఇన్నింగ్స్ 40వ ఓవర్)లో మూడు ఫోర్లతో హార్దిక్ విజృంభించాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.