Hardik Pandya : రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత భారత జట్టు వన్డే కెప్టెన్ ఎవరు? అంటే అందరికి మొదట గుర్తొచ్చేది హార్దిక్ పాండ్యా(Hardik Pandya)నే. ఇప్పటికే టీ20 సారథి(T20 Captain)గా సక్సెస్ అయిన పాండ్యా వరల్డ్ కప్(ODI World Cup 2023) తర్వాత వన్డే పగ్గాలు అందుకొనే ఛాన్స్ ఉంది. అయితే.. భావి కెప్టెన్గా పేరొందిన హార్దిక్ పాండ్యా వన్డేల్లో తేలిపోతున్నాడు. ఈ ఆల్రౌండర్ వెస్టిండీస్(West Indies)తో రెండు వన్డేల్లోనూ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఈ సిరీస్లోనే కాదు ఇంతకు ముందు మ్యాచుల్లోనూ అతను చెత్త ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ వారసుడిగా మాజీ క్రికెటర్లతో ప్రశంసలు అందుకుంటున్న అతను ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా కొట్టలేకపోయాడు.
వన్డేల్లో ఈ ఏడాది పాండ్యా అత్యధిక స్కోర్ 54 మాత్రమే. ఈ ఏడాది హార్దిక్ 10 వన్డేలు ఆడాడు. ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడే అతను 23.33 సగటుతో కేవలం 210 పరుగులు చేశాడంతే. తాజాగా విండీస్తో రెండు మ్యాచుల్లో కలిసి 12 రన్స్ కొట్టాడు. అయితే.. బంతితో మాత్రం ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటికి 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పుగా బ్యాటింగ్ చేయాల్సిన అతను చెత్త షాట్ ఆడి వికెట్ సమర్పించుకోవడం పరిపాటి అయింది.
హార్దిక్ పాండ్యా
పాండ్యా 2016 అక్టోబర్ 16న వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్పై టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. దాంతో, ఆరంగేట్రం గేమ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న నాలుగో భారత క్రికెటర్గా రికార్డు సాధించాడు. సందీప్ పాటిల్(Sandeep Patil), మోహిత్ శర్మ(Mohit Sharma), కేఎల్ రాహుల్(K.L Rahul) అతడి కంటే ముందున్నారు. ఇప్పటి వరకు 76 వన్డేలు ఆడాడు. 9 హాఫ్ సెంచరీలతో కలిపి 1,596 పరుగులు చేశాడు. ఐపీఎల్లో పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే.