IPL 2023 : మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), శ్రీశాంత్ (Sreesanth) కామెంటేటర్లుగా కొత్త అవతారం ఎత్తనున్నారు. ఐపీఎల్(IPL) 16వ సీజన్లో కామెంటరీ ప్యానెల్కు వీళ్లిద్దరు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ట్విట్టర్ ఖాతాలో వీడియో పెట్టింది. వీళ్లిద్దరితో పాటు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కూడా కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. 2008 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చెంప దెబ్బ వివాదంతో భజ్జీ, కేరళ స్పీడ్స్టర్ శ్రీశాంత్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత భజ్జీ తాను అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపడ్డాడు.
‘ఆరోజు పొరపాటు జరిగింది. నేను తప్పు చేశాను. నా వల్ల నా టీమ్మేట్ అవమానానికి గురయ్యాడు. నేను కూడా అవమానపడ్డాను’ అని ఈ మాజీ స్పిన్నర్ వెల్లడించాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఆడుతున్న సమయంలో స్పాట్ ఫిక్సింగ్ కేసులో శ్రీశాంత్పై నిషేధం విధించారు. అయితే.. కోర్టు అతడి నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో, అతను కేరళ రంజీ జట్టుకు కూడా ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన హర్భజన్ ఐపీఎల్లో ఆడాడు.
పదిహేను సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తున్న ఐపీఎల్ మరో సీజన్ మార్చి 31న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగు సార్లు ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టాస్ తర్వాత తుది జట్టును ఎంచుకోవడం, ఇంప్యాక్ట్ ప్లేయర్ను ఆడించడం వంటివి ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు. అంతేకాదు ప్రతి టీమ్ సొంతగ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది.
We’re bringing back fierce rivals yet comrades- @harbhajan_singh 🤝 @sreesanth36 while @MohammadKaif brings his shuddh Hindi ka tadka!
Join the Incredible Starcast at #IPLonStar, Mar 31 onwards on Star Sports Network.#ShorOn #GameOn #BetterTogether #IPLonStar #CricketLive pic.twitter.com/hQIzwsdRR6
— Star Sports (@StarSportsIndia) March 23, 2023