WPL Playoff | ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ ఫైనలిస్ట్లు తేలే సమయం ఆసన్నమైంది. లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింట నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా డబ్ల్యూపీఎల్ ఫైనల్కు దూసుకెళ్లగా.. శుక్రవారం ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచిన జట్టు.. ఆదివారం ఢిల్లీతో ఫైనల్లో తలపడనుంది.
హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్లో పటిష్టంగా ఉంది. హర్మన్తో పాటు హీలీ మాథ్యూస్, యస్తిక భాటియా, స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్ , పూజా వస్త్రాకర్ రూపంలో టాప్ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్లో సైకా ఇషాఖ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ తహిలా మెక్గ్రాత్, సోఫియా ఎకెల్స్టోన్పై ఎక్కువ ఆధారపడుతోంది.