Gujarat Titans | గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో ఓటమి అనంతరం.. వారు వెళ్తున్న బస్సులో అకస్మా్తుగా మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను సురక్షితంగా బయటకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం గుజరాత్ జట్టు హోటల్కు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన కారణంగా ఆటగాళ్లు దాదాపు గంటసేపు రోడ్డుపైనే ఉండిపోయినట్లు సమాచారం. అనంతరం మరో బస్సులో తాము బస చేసే హోటల్కు వెళ్లిపోయారు.
ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.తొలుత రసిఖ్ సలామ్ దార్ (3/27), భువనేశ్వర్ (2/29), హేజిల్వుడ్ (2/37) బుల్లెట్లలాంటి బంతులు వేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీతో పోరాడాడు. అనంతరం కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్) ముందుండి నడిపించడంతో చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.