మొహాలీ: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా పడింది. ఐపీఎల్ 16వ సీజన్లో బాగంగా గురువారం పంజాబ్తో జరిగిన పోరులో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా విధించారు.
‘స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించాం. తాజా సీజన్లో గుజరాత్ జట్టుకు ఇదే తొలి తప్పిదం’ అని శుక్రవారం ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. తాజా సీజన్లో మూడు మ్యాచ్ల్లో నెగ్గింది.