అహ్మదాబాద్ : గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సెంచరీ నమోదు చేయడంతో గిల్ ఒకే యేడాది టెస్టు, వన్డే, టి20, ఐపీఎల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఈ యేడాది ఆరంభంలో న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ చేశాడు. అదే జట్టుపై అహ్మదాబాద్ వన్డేలో 99 బంతుల్లో అజేయంగా 126 పరుగులు నమోదు చేశాడు.
అహ్మదాబాద్లోనే మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి, నాలుగో టెస్టులో సెంచరీ సాధించాడు. ఇలా ఒకే యేడాది నాలుగు విభాగాలలో సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఐపీఎల్లో గిల్ అత్యధిక పరుగులు(13 మ్యాచ్లలో 576) సాధించిన రెండో బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అంతేగాక వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో(9 మ్యాచ్లలో 624 పరుగులు) ఉన్నాడు.