WPL 2024 : మహిళల క్రికెట్లో కొత్త విప్లవం తెచ్చిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL) రెండో సీజన్కు మరో 4 రోజుల్లో తెరలేవనుంది. దాంతో, అన్ని జట్లు ఇప్పటికే నెట్స్ ప్రాక్టీస్ వేగం పెంచడంతో పాటు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. తొలి సీజన్లో తడబడిన జట్లు ఈసారి టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో అదానీస్పోర్ట్స్ లైన్కు చెందిన గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది.
సోమవారం గుజరాత్ మేనేజ్మెంట్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కొత్త జెర్సీ డిజైన్, రంగు కొంచెం ప్రత్యేకంగా ఉంది. అనంతరం హెడ్ కోచ్ మేఖేల్ క్లింగర్, మెంటార్ మిథాలీ రాజ్లు జట్టు సభ్యులతో కలిసి ఫొటోలకు పోజిచ్చారు. 2014 ఎడిషన్లో గుజరాత్ జట్టుకు బేత్ మూనీ కెప్టెన్గా, ఆల్రౌండర్ స్నేహ్ రానా వైస్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.
Servin’ fresh looks ahead of the new season! 👀
Our Giants are ready and excited to #BringItOn! 🧡#GujaratGiants #Adani pic.twitter.com/jkFLDB6ukv
— Gujarat Giants (@Giant_Cricket) February 17, 2024
రెండో సీజన్కు ముందు గుజరాత్ స్క్వాడ్ నుంచి లారెన్ చీట్లే(Lauren Cheatle) వైదొలిగింది. చర్మ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె సర్జరీ కోసం స్వదేశానికి వెళ్లింది. దాంతో, ఆమె స్థానంలో న్యూజిలాండ్ పేసర్ లీ తుహుహు(Lea Tuhuhu)తో గుజరాత్ ఫ్రాంచైజీ ఒప్పందం చేసుకుంది. తొలి సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన గుజరాత్ ఈసారి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది.
A look behind the curtain before the action begins. 😎🎥#BringItOn #Adani #GujaratGiants pic.twitter.com/Ox0cKpdsqB
— Gujarat Giants (@Giant_Cricket) February 18, 2024
గుజరాత్ స్క్వాడ్ : బేత్ మూనీ (కెప్టెన్), ఆల్రౌండర్ స్నేహ్ రానా (వైస్ కెప్టెన్), లారా వొల్వార్డ్త్, దయలాన్ హేమలత, హర్లీన్ డియోల్, తనుజా కన్వర్, షబ్నమ్ షకిల్, ఫొబే లిచ్ఫీల్డ్, ప్రియా మిశ్రా, వేద కృష్ణమూర్తి, త్రిషా పూజిత, కత్రిన్ బ్రైస్, తరన్నుమ్ పఠాన్, కష్వీ గౌతమ్, లీ తుహుహు, మన్నత్ కష్యప్, మేఘనా సింగ్.
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో షురూ కానుంది. అదే రోజున చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనున్నాయి.
#GiantArmy, save the dates! 🗓️
The fixtures for Season 2 of @wplt20 are now out. 🙌🏻#GujaratGiants #BringItOn #Adani #Cricket pic.twitter.com/AQbHEg5but
— Gujarat Giants (@Giant_Cricket) January 24, 2024
మార్చి 15న ఎలిమినేటర్ పోరు.. మార్చి 17న ఫైనల్ నిర్వహించనున్నారు. తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో రెండు నగరాల్లో జరుగనుంది. ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22మ్యాచ్లు ఆడనున్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 4 తర్వాత టోర్నీ మొత్తానికి ఢీల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.