ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్
న్యూఢిల్లీ: ఆసియా యూత్, జూనియర్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. తమ అద్భుత ప్రదర్శనతో ఏకంగా 15 స్వర్ణాలు కొల్లగొట్టారు. మంగళవారం యూత్ ఫైనల్లో విశ్వనాథ్ సురేశ్ (48 కిలోలు), వంశజ్ (63.5 కి) పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. విశ్వనాథ్ 5-0తో కిర్గిస్థాన్ బాక్సర్ ఎర్గ్షవ్ బెక్జత్పై ఏకపక్ష విజయం సాధించగా.. వంశజ్ 4-1తో జవోఖిర్(ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేశాడు. జోర్డాన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్కు మొత్తం 39 మెడల్స్ రాగా వాటిలో 15 స్వర్ణాలు, 10 రజతాలు 14 కాంస్యాలు ఉన్నాయి.