Gambhir vs Kohli: భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. కోహ్లీతో పాటు వరల్డ్ కప్ బ్రాడ్కాస్టర్గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ వ్యవహరిస్తున్న తీరుపై గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ కోహ్లీకి ఇవ్వాల్సినదానికంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని, అతడి వల్ల మిగతా ఆటగాళ్లు అండర్ రేటెడ్ అవుతున్నారని వాపోయాడు.
ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ‘మీరు ఒక ఫిఫ్టీ చేసి నేనూ అర్థ సెంచరీ చేస్తే బ్రాడ్కాస్టర్ నన్ను మాత్రమే చూపిస్తే అప్పుడు మీరు అండర్ రేటెడ్ అయినట్టే. ఇక్కడ ఒక ఆటగాడిని అండర్ రేటెడ్ చేస్తున్నది ఎవరు..? ఫ్యాన్స్, బ్రాడ్కాస్టర్స్, క్రికెట్ ఎక్స్పర్ట్స్ వల్లే ఇదంతా. మనం సుదీర్ఘకాలంగా ఐసీసీ ట్రోఫీలను గెలవకపోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే. మనం వ్యక్తిగత రికార్డుల కోసమే పాకులాడుతున్నాం తప్ప జట్టు బాగు కోసం చూడటం లేదు..’ అని అన్నాడు.
Gautam Gambhir brutally exposed the PR game of Star Sports who’s robbing the credits of other players of Indian team.
STAR SPORTS DIVIDING ICT
SHAME ON STAR SPORTSpic.twitter.com/0ASNPt2sCR— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) November 13, 2023
వరల్డ్ కప్ను ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ మీద స్పెషల్ ఫోకస్ ఉంచిందనేది జగమెరిగిన సత్యం. స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత జట్టు సమిష్టిగా రాణిస్తున్నా స్టార్ మాత్రం.. కోహ్లీ ఇటీవలే సచిన్ 49 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడం.. ఐదు అర్థ సెంచరీలు చేయడం, నెదర్లాండ్స్తో మ్యాచ్లో బౌలింగ్ చేసి వికెట్తీయడంతో కోహ్లీకి విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తున్నది. కోహ్లీ తినే ఫుడ్, అతడి పర్సనల్ లైఫ్కు సంబంధించిన విషయాలు, పలు కీలక మ్యాచ్లలో అతడు ఎలా ఆడాలనేదానిపై ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసి వండి వార్చుతోంది. గంభీర్ ఇప్పుడు టార్గెట్ చేసింది కూడా వీటి గురించే..