ODI World Cup 2019 : క్రికెట్ను కనిపెట్టిన ఇంగ్లండ్ (England) జట్టు సుదీర్ఘ నిరీక్షణ 2019లో ఫలించింది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా ఎదురుచూసిన ఇంగ్లండ్ ఆ ఏడాది వన్డే వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. అయితే.. ఇయాన్ మోర్గాన్ సేన వరల్డ్ కప్ విజయం మాత్రం ఇప్పటికీ చర్చకు తావిస్తూనే ఉంది. ఈ మధ్యే అంపైరింగ్ కెరీర్కు వీడ్కోలు పలికిన మరాయిస్ ఎరాస్మస్(Marais Erasmus) సైతం షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అపైరింగ్ పొరపాటుతోనే ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచిందని అన్నాడు.
‘న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో బెన్ స్టోక్స్(Ben Stokes) బ్యాట్ తగిలడంతో బంతి బౌండరీకి వెళ్లింది. దాంతో, నేను కుమర ధర్మసేన కాసేపు చర్చించి ఆరు పరుగులు ఇచ్చాం. అయితే.. మరుసటి రోజు ఉదయం ధర్మసేన ‘మనం పెద్ద తప్పు చేశాం’ అన్నాడు. ఇద్దరం సిక్స్, సిక్స్, అవును సిక్స్ అని సిగ్నల్ ఇచ్చాం. కానీ, ఐదు పరుగులే ఇవ్వాల్సింది’ అని ఎరాస్మస్ తెలిపాడు.
బెన్ స్టోక్స్(84 నాటౌట్)
ఐసీసీ రూల్స్ ప్రకారం బ్యాటర్ పరుగు పూర్తి చేశాక ఓవర్ త్రోకు పరుగులు ఉండవు. ఒకవేళ పరుగు తీస్తున్న క్రమంలో బంతి ఓవర్ త్రో కారణంగా బంతి బౌండరీకి వెళ్తే అదనంగా 4 పరుగులు ఇవ్వాలి. కానీ, ఈ నియమాలు పాటించని ఎరాస్మస్, ధర్మసేనలను అంపైర్ సైమన్ టైఫెల్(Simon Taufel) అనే అంపైర్ తీవ్రంగా విమర్శించాడు.
లార్డ్స్లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 241 రన్స్ కొట్టింది. భారీ ఛేదనలో స్టోక్స్(84 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో ఓవర్త్రో బౌండరీ కారణంగా స్కోర్లు సమం అయ్యాయి. దాంతో, మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్ కూడా 15 పరుగులతో టైగా ముగిసింది. దాంతో, ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను విజేతగా ప్రకటించారు. దాంతో, న్యూజిలాండ్ గుండెపగిలింది.