భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్.. అన్ని ఫార్మాట్లలో క్రికెట్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో అన్నివైపుల నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా మిథాలీకి కంగ్రాట్స్ చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్లో ఆమెకు ఆల్ ది బెస్ట్ అన్నాడు. ఈ సందర్భంగా జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ల వయసు కన్నా.. మిథాలీ ఫామ్లో ఉన్న కాలమే ఎక్కువంటూ జాఫర్ కితాబిచ్చాడు. ‘‘తన కెరీర్ చివరి దశలో.. తన జట్టులో తోటి ఆటగాళ్లు జీవించి ఉన్న కాలం కన్నా మిథాలీ ఫామ్లో ఉన్న కాలం ఎక్కువ. భారత క్రికెట్కు ఆమె అంత కాలం సేవలు అందించింది.
కంగ్రాచ్యులేషన్స్ అండ్ థాంక్యూ మిథాలీ రాజ్. నీ సెకండ్ ఇన్నింగ్స్కు గుడ్ లక్’’ అంటూ జాఫర్ ట్వీట్ చేశాడు. షెఫాలీ వర్మ, పూజా వస్త్రాకర్ వంటి ఆటగాళ్ల వయసు కన్నా.. మిథాలీ క్రికెట్ కెరీర్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే.
Towards the end of her career, Mithali had been in form longer than some of her teammates had been alive 🙂 That's how long she served Indian cricket. Congratulations and thank you @M_Raj03. Good luck for your second innings 🙌🏼 pic.twitter.com/dQYTP8fMxd
— Wasim Jaffer (@WasimJaffer14) June 8, 2022