ODI World Cup 2023 : ప్రపంచ క్రికెట్లో పసికూనగా ముద్ర పడిన అఫ్గనిస్థాన్.. వన్డే వరల్డ్ కప్(OD World Cup 2023)లో పెద్ద జట్లకు షాకిస్తోంది. తొలుత డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను చిత్తు చేసి ప్రకంపనలు సృష్టిచింన అప్గన్.. ఆ తర్వాత పాకిస్థాన్ను మట్టికరిపించింది. ఈ రెండు విజయాలు గాలివాటం కాదని చాటుతూ.. సోమవారం పుణేలో బలమైన శ్రీలంకను చిత్తుగా ఓడించింది. కాబులీ జట్టు గెలుపును క్రికెట్ అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ సమయంలో స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో ఉన్న భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan), హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఫుల్ జోష్తో చిందేశారు. ‘ఎంత గొప్ప విజయం ఇది. మూడో విజయం సాధించిన అఫ్గన్ జట్టుకు అభినందనలు. మూడు వరల్డ్ చాంపియన్ జట్లను ఓడించారు’ అంటూ పఠాన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.
సంచలనాలకు మారు పేరైన అఫ్గనిస్థాన్ జట్టు పుణేలో 2011 రన్నరప్ లంకను ఓ ఆట ఆడుకుంది. ఫజల్హక్ ఫారుఖీ 4 వికెట్లతో చెలరేగగా.. 242 పరుగుల ఛేదనలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(58 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(73) అర్థ శతకాలతో కడదాకా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. దాంతో. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో మూడింట ఓడి.. మూడింట గెలిచి ఆరు పాయింట్లతో సెమీస్ రేసులో నిలిచింది. వరుసగా రెండు విజయాలతో గాడీలో పడ్డట్టే కనిపించిన కుశాల్ మెండిస్ సేన కీలక పోరులో తడబడి సెమీస్ బెర్తుకు ఆమడ దూరం జరిగింది.